మడికొండ, నవంబర్ 8: టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్లోని ఉనికిచర్లలో సోమవారం ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం పల్లా మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని గుర్తుచేశారు.