హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించిన ఫ్లెక్సీలు దేశంలోని బీజేపీ పాలిత రాష్ర్టాల్లో జిగేల్ మంటున్నాయి. ఈ నెల 27న నిర్వహించే వేడుకలకు సంబంధించిన ఫ్లెక్సీలు బీహార్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ర్టాల్లోని ప్రధాన కూడళ్లల్లో దర్శనమిస్తున్నాయి. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో దేశ్ కీ నేత కేసీఆర్ అంటూ తెలంగాణ సాయి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సీఎం కేసీఆర్ జాతీయస్థాయిలో బడుగు, బలహీన వర్గాలకు వెన్నుదన్నుగా నిలవాలని ఆకాంక్షిస్తూ వెలిసిన ఫ్లెక్సీలు ఆసక్తికర రాజకీయాలకు తెరలేపుతున్నాయి