హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) ఎన్నికైనట్టు భారత ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్ గత సంవత్సరం (2021) డిసెంబర్ 4న తన పదవికి రాజీనామా చేయటంతో ఏర్పడిన ఖాళీకి జరిగిన ఉపఎన్నికలో వద్దిరాజు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారని, ఏప్రిల్ 2, 2024 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారని గెజిట్లో పేర్కొన్నారు.