వరంగల్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా జిల్లాలోని రాయపర్తి మండలం కొండూరు గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకి ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరుతున్నామన్నారు.
పార్టీలో చేరిన వారిలో గ్రామ మాజీ సర్పంచ్ పెండ్లి ఎల్లయ్య, రామారపు కుమార్ స్వామి, పెండ్లి రవీందర్, పెండ్లి భిక్షపతి, రామారపు యాకయ్య, కొంగరి క్రాంతి కుమార్, రామారపు రాజు, కొంగరి చిరంజీవి, పెండ్లి కుమార స్వామి తదితరులు ఉన్నారు.