హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన గిరిజన ఆత్మగౌరవ భవనాలు దేశంలోని ఆదివాసీ, గిరిజనులకు స్ఫూర్తిదాయకమని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం బంజారాహిల్స్లోని సంత్సేవాలాల్ బంజారా భవన్, కుమ్రంభీం ఆదివాసీ భవనాల సందర్శన కోసం మునుగోడు నియోజకర్గానికి చెందిన బంజారాలు కుటుంబ సమేతంగా తరలివచ్చారు.
సీఎం కేసీఆర్ గిరిజనుల ఆత్మగౌరవాన్ని సమున్నతంగా చాటుతున్నారని.. ఆదివాసీ, బంజారా ఆత్మగౌరవాల నిర్మాణమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. బంజారాల, ఆదివాసీల సంస్కృ తి, సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఈ భవనాలను నిర్మించామని తెలిపారు. త్వరలో దేశంలోని అన్ని ప్రాంతాల గిరిజన ప్రతినిధులతో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన పెద్దలు, మేధావులు, విద్యావంతులను ఏకతాటిపైకి తెచ్చేలా ప్రణాళికలు రూపొందుతున్నాయని తెలిపారు. ఏటా ఆత్మగౌరవ భవనాల్లో బంజారా, ఆదివాసీ పండుగలను ఘనంగా జరుపుకొంటామని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్, ట్రైకార్ చైర్మన్ రామచంద్రనాయక్, జీసీసీ చైర్మన్ వాల్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.