గజ్వేల్, ఏప్రిల్ 10: ఆరు జిల్లాలకు తాగునీరందించేందుకు సిద్దిపేట జిల్లా కుకునూర్పల్లి మండలం మంగోల్ వద్ద నిర్మించిన మిషన్ భగీరథ నీటిశుద్ధి ప్లాంట్ ట్రయ ల్ రన్ విజయవంతమైంది. సోమవారం మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు తిప్పారం వద్ద మోటర్లకు ప్రత్యేక పూజలు చేసి ట్రయల్ రన్ చేశారు. దేశంలో నే గ్రామీణ ప్రాంతంలో నిర్మించిన అతిపెద్ద 540 ఎంఎల్డీ ప్లాంట్ మంగోల్ వద్ద రూ.1212 కోట్లతో ప్రభుత్వం నిర్మించిం ది. మల్లన్నసాగర్ నుంచి ఏటా 10 టీఎంసీల నీటిని ఈ ప్లాంట్ ద్వారా శుద్ధి చేస్తారు. మెగావాట్ సామర్థ్యం కలిగిన 6 మోటర్ల చొప్పున రెండుచోట్ల 12 మోటర్లను బిగించారు. ఇందులో ఒక్కోచోట నాలుగు మో టర్లను వినియోగిస్తారు. వీటన్నింటిని ట్ర యల్న్ చేశారు. ఇక్కడి నుంచి సిద్దిపేట, జనగాం, భువనగిరి, మేడ్చల్, మెదక్, సూ ర్యాపేట జిల్లాలకు తాగునీటిని పంపిణీ చే స్తారు. గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట, జన గాం, పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్, ఆలేరు, భువనగిరి, మేడ్చల్, తుంగతుర్తి, నకిరేకల్, నర్సాపూర్ నియోజకవర్గాల్లోని 1922 గ్రామాలకు నీటిని సరఫరా చేస్తారు. 2048 నాటి జనాభా అవసరాలు తీర్చేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, సీఎంవో ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్, కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్, ఈఎన్సీలు కృపాకర్, హరిరాం తదితరులు పాల్గొన్నారు.