హైదరాబాద్ : మేడ్చల్ మల్కాజ్గిరి నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రారంభోత్సవానికి వచ్చిన సీఎం కేసీఆర్ను ట్రెసా ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. రెవెన్యూ శాఖలో ప్రస్తుత పరిస్థితులు, పలు పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేయగా.. సీఎం సానుకూలంగా స్పందించి.. త్వరలో పిలిచి మాట్లాడతానన్నారు. పలు పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు ఆదేశాలు ఇస్తానని హామీ ఇచ్చారు.
సీఎంను కలిసిన వారిలో ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కే గౌతమ్ కుమార్తో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షులు కే నాగమణి, కార్యదర్శి వాణి, సంయుక్త కార్యదర్శులు ఎల్.వెంకటేశ్వర్ రావు, గోవర్ధన్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు పీ సుధాకర్, జిల్లా కార్యదర్శి వీ రామకృష్ణా రెడ్డి,జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు రాజేశ్వర్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు గౌరీ వత్సల, జిల్లా కార్యవర్గ సభ్యులు, శామీర్ పేట్ తహసీల్దార్ సత్యనారాయణ, తహసీల్దార్లు విజయలక్ష్మి, భూపాల్, మహిపాల్ రెడ్డి, గీత, ఎస్తేర్ అనిత ఉన్నారు.