మంగళవారం వేములవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో ఓ ప్రయాణికుడికి సీటు దొరకకపోవడంతో డ్రైవర్తో వాగ్వాదానికి దిగాడు. తనకు సీటు ఇవ్వనిదే బస్సు కదిలేది లేదని పట్టుబట్టాడు. మరో ప్రయాణికుడు జోక్యంతో అది గొడవకు దారి తీసింది.
ఇద్దరూ బస్సు దిగి హైవే మీదే తన్నుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకొని గొడవకు పాల్పడ్డవారిని అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ ఇచ్చారు.
– వేములవాడ రూరల్