కలెక్టరేట్(కరీంనగర్), ఫిబ్రవరి 21 : ట్రాన్స్జెండర్లు స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ప్రభు త్వం వారికి రుణాలు మంజూరు చేస్తూ అం డగా నిలుస్తున్నది. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా కరీంనగర్లో ఆశ అనే ట్రాన్స్జెండర్కు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మంగళవారం రూ.5లక్షల సబ్సిడీ రుణ మంజూరు పత్రా లు అందజేశారు.
కలెక్టరేట్ ఆడిటోరియం లో నిర్వహించిన డీసీసీడీఎల్ఆర్సీ సమావేశంలో పీఎంఈజీపీ పథకం కింద ఎంపిక చేసి ఫొటోగ్రఫీ యూనిట్ స్థాపించుకునేందుకు ఎస్బీఐ ద్వారా రుణం మంజూరు చేయించినట్టు కలెక్టర్ పేర్కొన్నారు. మరో ట్రాన్స్జెండర్ నక్క సింధుకు ఫోర్ వీల్ డ్రైవింగ్ లైసెన్స్ అందజేశారు.