హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లోని ఉద్యోగుల బదిలీల సవరణ షెడ్యూల్ను శుక్రవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన విడుదల చేశారు.
శనివారం నుంచే ప్రారంభంకానున్న ఈ బదిలీల ప్రక్రియను నెలాఖరులోపు పూర్తిచేయాలని ఆదేశించారు. కేజీబీవీల్లో స్పెషలాఫీసర్లు, పీజీసీఆర్టీలు, సీఆర్టీలు, పీఈటీలు, ఏఎన్ఎంలను బదిలీ చేయనున్నారు. తొలుత జిల్లాస్థాయిలో బదిలీలు చేపడతారు. ఆ తర్వాత అంతర్ జిల్లా బదిలీలకు అవకాశం ఇస్తారు. మొదట షెడ్యూల్ను విడుదల చేయగా, అందులో స్వల్పమార్పులు చేశారు.