హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రప్రభుత్వం అటవీశాఖ అధికారులకు బదిలీలు, ప్రమోషన్లు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మోహన్చంద్ర పర్గేయిన్ను వైల్డ్లైఫ్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్గా, హరితహారం చీఫ్ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ డాక్టర్ సీ సువర్ణను కంపా సీఈవోగా, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్గా, అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సునీతా ఎం భాగవత్ను అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (అడ్మిన్)గా నియమించారు. 2010 బ్యాచ్కు చెందిన ఎస్ శాంతారాంకి ప్రమోషన్పై మంచిర్యాల కవ్వాల్ టైగర్ రిజర్వ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, ఫీల్డ్ డైరెక్టర్గా నియమించింది. 2011 బ్యాచ్కి చెందిన ఎస్ రాంబాబును హైదరాబాద్ సర్కిల్ డీసీఎఫ్గా, డాక్టర్ సునీల్ ఎస్ హెరిమత్ను నెహ్రూ జూలాజికల్ పార్క్ క్యూరేటర్గా ప్రభుత్వం నియమించింది.