Telangana | హైదరాబాద్ : రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు బదిలీ అయ్యారు. మల్టీజోన్-1 ఐజీగా రంగనాథ్, టీఎస్ న్యాబ్ ఎస్పీగా శరత్ చంద్ర పవార్, ఆర్గనైజేషన్స్ ఐజీగా విశ్వప్రసాద్ నియామకం అయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.