హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పలువురు రైల్వే పోలీస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రైల్వే అండ్ రోడ్ సేఫ్టీ విభాగం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
మల్టీ జోన్-2 నుంచి కొత్తగా రిపోర్టు చేసిన ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బీ సాయి ఈశ్వర్గౌడ్ను ఇన్స్పెక్టర్ రైల్వే పోలీస్ (ఐఆర్పీ)గా సికింద్రాబాద్లోని రైల్వే పోలీస్ స్టేషన్కు, సికింద్రాబాద్ ఆర్పీఎస్లో పనిచేస్తున్న ఎం శ్రీనును సర్కిల్ ఇన్స్పెక్టర్గా సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. మల్టీ జోన్-2 నుంచి కొత్తగా రిపోర్టు చేసిన ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బీ ప్రవీణ్కుమార్ను ఐఆర్పీగా హైదరాబాద్కు, ఇప్పటివరకు హైదరాబాద్ ఆర్పీఎస్లో ఐఆర్పీగా పనిచేసిన ఏ శ్రీనివాస్ను సికింద్రాబాద్ (లైన్)కు బదిలీ చేశారు.