హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా ఒకేచోట మూడేండ్లు ఉద్యోగకాలం పూర్తిచేసుకున్న, సొంత జిల్లాల్లో పనిచేస్తున్న మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ల (ఎంపీడీవో)ను ఇతర జిల్లాలకు బదిలీచేస్తూ పంచాయతీరాజ్ గ్రామీణ ఉపాధి శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు ఈ నెల 12న వారిని రిలీవ్ చేయాలని, బదిలీ అయినవారు తమకు కేటాయించిన జిల్లాలో 13న జాయిన్ కావాలని ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.