హైదరాబాద్, జనవరి 28(నమస్తే తెలంగాణ): రాష్ట్ర వ్యాప్తంగా 41 మంది ఏసీపీలు, డీఎస్సీలను బదిలీ చేస్తూ డీజీపీ అంజనీకుమార్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువగా బదిలీలయ్యాయి. నారాయణఖేడ్, మిర్యాలగూడతో పాటు విజిలెన్స్-ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డీఎస్పీలుగా వెంకట్రెడ్డి, వెంకటగిరి, రవికుమార్రెడ్డి, మియాపూర్, ఖమ్మం టౌన్, పెద్దపల్లి, మేడ్చల్, యాదాద్రి, నార్సింగి ఏసీపీలుగా నర్సింహారావు, పీవీ గణేశ్, ఏ మహేశ్, సామల వెంకట్రెడ్డి, సైదులు, రమణగౌడ్తో పాటు ఇతర అధికారులను బదిలీ చేశారు.