హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులకు సమగ్ర శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు పంచాయతీరాజ్శాఖ ట్రై నింగ్ షెడ్యూల్ను ఖరారు చేసింది. పంచాయతీరాజ్శాఖ మంత్రి సీత క ఆదేశాల మేరకు.. టీజీఐఆర్డీ ఆధ్వర్యంలో ఈ నెల 19 నుంచి వచ్చే 21 వరకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సర్పంచులకు వారి విధులు, నిధులు, బాధ్యతలు, హకులు, పంచాయతీరాజ్ చట్ట ంపై అవగాహన కల్పించేలా శిక్షణ షెడ్యూల్ రూపొందించారు. సర్పంచుల కోసం ప్రత్యేక స్టడీ మెటీరియల్, కరదీపికను సిద్ధం చేశారు. ప్రతి జిల్లాలో ఐదు బ్యాచ్లుగా సర్పంచ్లకు శిక్షణ ఇవ్వనుండగా, ఒకో బ్యాచ్లో కనీసం 50 మంది ఉంటారు.
ప్రతి బ్యాచ్కు ఐదు రోజులపాటు తరగతులు నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12,760 మంది సర్పంచులకు శిక్షణ ఇవ్వనుండగా, ఒకో సర్పంచ్కు ఐదు రోజులపాటు బస, భోజనం, శిక్షణా ఖర్చుల కోసం రూ.5,000 వరకు ప్రభుత్వం వెచ్చించనున్నది. సర్పంచులకు శిక్షణ ఇచ్చేందుకుగాను 253 మంది మాస్టర్ ట్రైనర్లను ఎంపిక చేసి, వారికి టీజీఐఆర్డీలో ఓరియంటేషన్ పూర్తి చేశారు. వీరు సర్పంచులకు పాలన, అభివృద్ధి, ఆర్థిక నిర్వహణ, ప్రజాసేవ అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ క్రమంలో సర్పంచుల శిక్షణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. సర్పంచులకు శిక్షణ ఇవ్వడం ద్వారా గ్రామ పంచాయతీలు మరింత బలోపేతం కావడండంతోపాటు పారదర్శకమైన పాలన అందుతుందని ప్రభుత్వం భావిస్తున్నది.