హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలో బీఆర్ఎస్ దౌడ్ తీస్తున్నది. ఒకవైపు చేరికలు, మరోవైపు శిక్షణాశిబిరాల నిర్వహణ వంటి కార్యాచరణతో రాష్ట్ర రాజకీయాల్లో గుబులు పుట్టిస్తున్నది. నియోజకవర్గ సమన్వయకర్త, మహిళా సమన్వయకర్త, కిసాన్ సమన్వయకర్తలతోపాటు ఇప్పటికే పార్టీలో చేరి వివిధ హోదాల్లో ఉన్న నాయకులకు ఈ నెల 19, 20వ తేదీల్లో నాందేడ్లోని అనంత్లాన్స్లో నిర్వహించే శిక్షణాశిబిరాల కు రావాల్సిందిగా ఆహ్వానాలు వెళ్లాయి. ఈ శిబిరాలను బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారని మహారాష్ట్ర పార్టీ వర్గాలు తెలిపాయి.
ఏయే అంశాలపై శిక్షణ?
మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు ఎం దుకు జరుగుతున్నాయి? వీటిని నివారించకపోవటానికి గల కారణాలు ఏమిటి? ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాద నేపథ్యం? మహారాష్ట్రలో బీఆర్ఎస్ ఆవశ్యకత ఏమిటి? బీఆర్ఎస్ మిషన్? బాధ్యతాయుత రాజకీయ పా ర్టీగా మహారాష్ట్ర స్థితిగతులను మెరుగుపరచ టం కోసం ఏం చేయబోతున్నది? మొదలైన అంశాలపై ముఖ్య నాయకులకు స్పష్టమైన అ వగాహన కల్పించటమే ఈ శిక్షణా శిబిరాల లక్ష్యమని బీఆర్ఎస్ మహారాష్ట్ర కిసాన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ కదం చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి కావలసిన ప్రచార సామగ్రి (వాల్ పోస్టర్లు, కరపత్రాలు, పార్టీ జెండాలు, కండువాలు వగైరా)ని నియోజకవర్గ సమన్వయకర్తలకు అందించేందుకు ఏర్పాట్లు చేసినట్టు మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోండ్గే తెలిపారు.