తూప్రాన్: మెదక్ జిల్లా తూప్రాన్ సమీపంలో శిక్షణ విమానం (Training airplane) కుప్పకూలింది.
సోమవారం ఉదయం తూప్రాన్ (Toopran) మున్సిపాలిటీ పరిధిలోని రావెళ్లి సమీపంలో ఒక శిక్షణ విమానం
కూలిపోయింది. దీంతో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో పైలెట్, ట్రైనీ పైలెట్ సజీవ దహనమయ్యారు.
విమాన ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అది దుండిగల్ ఎయిర్పోర్టుకు సంబంధించిన శిక్షణ విమానంగా గుర్తించారు. మంటల్లో ఇద్దరు పైలెట్లు మృతిచెందారని, గుర్తించలేని విధంగా కాలిపోయారని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.