Train Accident | ఫలక్నుమా రైలు ప్రమాద ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ విచారణ ప్రారంభించింది. ఘటనపై ఎలాంటి సమాచారం ఉన్నా రైల్వేకు తెలియజేయాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది. ప్రమాదంపై ఏమైనా అనుమానం, సాక్ష్యాలు ఉంటే తెలియజేయాలని విజ్ఞప్తి చేసింది. చాలన్ భవన్కు ఈ నెల 10, 11 తేదీల్లో వచ్చి వివరాలు ఇవ్వొచ్చని చెప్పింది. మరో వైపు ఫలక్నుమా ఎక్స్ప్రెస్ మంటలపై అధికారుల దర్యాప్తు చేపట్టారు. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్లు గుర్తించిన క్లూస్ టీమ్ గుర్తించింది. ముందు ఎస్-4 బోగీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని, మంటలు నిమిషాల్లోనే ఇతర బోగీలకు వ్యాపించినట్లు గుర్తించిన క్లూస్ టీమ్ భావిస్తున్నది. నిన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్నుమా రైలులో మంటలు చెలరేగాయి. పూర్తిగా తగలబడిన ఫలక్నుమా ఎక్స్ప్రెస్ ఐదు బోగీలు, మరొకటి పాక్షికంగా దగ్ధమైంది.