Baby Girl | కన్నెపల్లి, మార్చి 21 : మగబిడ్డ కావాలని ఎదురు చూసిన ఓ మహిళకు మూడోసారీ ఆడ బిడ్డే పుట్టడంతో గ్రామ శివారులో పడేసింది. విషాదకరమైన ఈ ఘటన మంచిర్యాల జిల్లా భీమిని మండలం కేస్లాపూర్లో చోటుచేసుకున్నది. కేస్లాపూర్కు చెందిన గంగక్కకు ఇద్దరు కూతుళ్లుండగా, పెద్ద కూతురికి వివాహమైంది. రెండో కూతురు పెళ్లీడుకొచ్చింది. మగ శిశువు కోసం ఎదురుచూసి మరోసారి గర్భందాల్చింది.
బుధవారం రాత్రి మూడోకాన్పులోనూ ఆడ శిశువు జన్మించడంతో తీవ్ర ఆవేదనకు గురైంది. పెండ్లయిన కూతురుండగా, మళ్లీ గర్భం దాల్చడం అవమానకరంగా భావించి.. అప్పుడే పుట్టిన శిశువును గ్రామ శివారులోని చేలల్లో పడేసి ఉంటుందని గ్రామస్థులు అనుమానిస్తున్నారు. గురువారం శిశువు మృతదేహాన్ని కుక్కలు గ్రామం దగ్గరికి లాక్కొని రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై విజయ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. విచారణ నిమిత్తం గంగక్కను పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.