హైదరాబాద్: రంజాన్ పండుగ సందర్భంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఎల్బీస్టేడియంలో ఇఫ్తార్ విందు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో స్టేడియం పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవి సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు అమల్లో ఉంటాయని చెప్పారు. దీంతో నిర్దేశించిన సమయంలో వాహనదారులు ఏఆర్ పెట్రోల్ బంక్ నుంచి బీజేఆర్ విగ్రహం, అక్కడి నుంచి బషీర్బాగ్ ఇరువైపుల వెళ్లకుండా, ప్రత్యామ్నాయ రూట్లలో ప్రయాణించాలని సూచించారు.
చాపల్ రోడ్డు, నాంపల్లి వైపు నుంచి వచ్చే వాహనాలకు బీజేఆర్ విగ్రహం వైపు అనుమతి ఉండదు. ఈ మార్గంలో వచ్చేవి ఏఆర్ పెట్రోల్ బంక్ వద్ద పీసీఆర్ వైపు మళ్లిస్తారు.
ఎస్బీఐ గన్ఫౌండ్రి వైపు నుంచి ప్రెస్క్లబ్, బషీర్బాగ్ ఫ్లైఓవర్ వైపు వాహనాలను అనుమతి ఉండదు. ఎస్బీఐ వద్ద చాపల్రోడ్డులోకి మళ్లిస్తారు.
రవీంద్రభారతి, హిల్పోర్టు నుంచి బీజేఆర్ విగ్రహం వైపు కాకుండా.. కేఆర్కే బిల్డింగ్ వద్ద సుజాత హైస్కూల్ రూట్లోకి పంపిస్తారు.
నారాయణగూడ సిమెట్రీ వైపు నుంచి బషీర్బాగ్ వచ్చే వాహనాలను ఓల్డ్ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద హిమాయత్నగర్ వై జంక్షన్ వైపు మళ్లిస్తారు.
కింగ్కోఠి, బొగ్గులకుంట నుంచి బషీర్బాగ్ వైపు భారతీయ విద్యా భవన్ మీదుగా వచ్చేవి కింగ్కోఠి ఎక్స్ రోడ్స్లో తాజ్మహల్, ఈడెన్ గార్డెన్ వైపు పంపిస్తారు.
బషీర్బాగ్ నుంచి పీసీఆర్ వైపునకు వాహనాల అనుమతి ఉండదు. ఈ వాహనాలను లిబర్టీ వైపు మళ్లిస్తారు.
రంజాన్ చివరి శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో మక్కామసీద్, సికింద్రాబాద్లోని జమే ఈ మసీద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో చార్మినార్ నుంచి మదీనా, చార్మినార్, ముర్గీచౌక్, రాజేశ్ మెడికల్ హాల్, శాలిబండ రోడ్లను మధ్యాహ్నం 3 గంటల వరకు మూసివేస్తున్నట్లు వెల్లడించారు.
మదీనా జంక్షన్, హిమ్మత్పురా, చౌక్ మైదాన్ ఖాన్, మోతీగల్లీ, ఇతెబార్ చౌక్ కూడళ్ల వద్ద ట్రాఫిక్ను మళ్లిస్తారు.
ప్రార్థనలకు వచ్చే వారి వాహనాలకు గుల్జార్ ఫంక్షన్ హాల్, ముఫీద్ ఉల్ అనామ్ గ్రౌండ్, చార్మినార్ బస్ టర్మినల్ , ఆయుర్వేద యూనానీ హాస్పిటల్, కిల్వత్ గ్రౌండ్, ఓల్డ్ పెన్షన్ ఆఫీస్, సర్దార్ మాల్, జీహెచ్ఎంసీ ఆఫీస్ పార్కింగ్ స్థలాలను కేటాయించారు.
సికింద్రాబాద్లోని సుభాష్ రోడ్డు (ఎంజీ రోడ్డులోని మహంకాళి పోలీస్స్టేషన్, రాంగోపాల్పేట్ రోడ్డు జంక్షన్) ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మూసివేస్తారు.
బాటా ఎక్స్రోడ్స్ నుంచి సుభాష్ రోడ్డులోకి వచ్చే వాహనాలను మహంకాళి పీఎస్ వద్ద లాలా టెంపుల్ వైపు మళ్లిస్తారు.
చార్మినార్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను అఫ్జల్గంజ్ వద్దకే పరిమితం చేస్తారు.
నయాపూల్ మీదుగా జిల్లాలకు వెళ్లే (రాయలసీమ వైపు వెళ్లేవి) బస్సులు చాదర్ఘాట్, నల్లగొండ క్రాస్రోడ్డు, సైదాబాద్, మిధాని, బండ్లగూడ, ఆరంఘర్ వైపు వెళ్లాల్సి ఉంటుంది.