హైదరాబాద్: నగరంలో ఆదివారం మారథాన్ (Marathon) నిర్వహించనున్నారు. ఈనేపథ్యంలో రేపు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు 42 కిలోమీటర్లు (ఫుల్ మారథాన్), 21 కిలోమీటర్లు (హాఫ్ మారథాన్), 10 కే మారథాన్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి మధ్య ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు చెప్పారు. దీంతో పలు కూడళ్లలో ట్రాఫిక్ మళ్లింపు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.