హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic restrictions) విధించారు. గోల్కొండ కోటలో (Golkonda) ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో గోల్కొండ పరిసరాల్లో ఆంక్షలు విధించారు. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ఆంక్షలు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. ఇక స్వాతంత్య్ర దినోత్సవ (Indipendence day) వేడుకల కోసం రాణిమహల్ లాన్స్ నుంచి గోల్కొండ కోట వరకూ ఉన్న రోడ్డు మూసివేశారు.
షేక్పేట, టోలీ చౌకీ నుంచి వచ్చే సాధారణ సాధారణ ప్రజలు వాహనాలను సెవెన్ టూంబ్స్ లోపల పార్కింగ్కు అనుమతించనున్నారు. కాగా, ఇండిపెండెన్స్డే సందర్భంగా గోల్కొండ కోటలో ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పరిశీలించారు.