హైదరాబాద్ : హైదరాబాద్ – విజయవాడ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి స్వస్థలాలకు జనాలు వెళ్తున్నారు. నేటి నుంచి విద్యార్థులకు సెలవులు ప్రకటించడంతో.. వాహనాల రద్దీ మరింత పెరిగింది. చిట్యాల వద్ద జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ఆంధ్రప్రదేశ్ వైపు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
ఇక నగరంలోని ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఉప్పల్, ఎల్బీనగర్, బీహెచ్ఈఎల్, కూకట్పల్లి ప్రాంతాల్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది.