హైదరాబాద్: ట్యాంక్బండ్పై సండే సందడి నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఆదివారం సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్బండ్పైకి వాహనాలకు అనుమతి లేదని తెలిపారు. వాహనదారులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఐదు చోట్ల ట్రాఫిక్ను మళ్లిస్తున్నారు.
లిబర్టీ నుంచి ట్యాంక్బండ్ వైపు వచ్చే వాహనాలు అంబేద్కర్ విగ్రహం నుంచి తెలుగు తల్లి ఫ్లై ఓవర్ కింద నుంచి ఇక్బాల్ మినార్ మీదుగా ప్రయాణించాలి.
తెలుగు తల్లి ఫ్లై ఓవర్ కింద నుంచి ట్యాంక్ బండ్కు వచ్చే వారు అంబేద్కర్ విగ్రహం మీదుగా లిబర్టీ హిమాయత్నగర్ వైపు వెళ్లాలి.
కర్బాలా మైదాన్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనదారులు సెయిలింగ్ క్లబ్ నుంచి కవాడిగూడ, డీబీఆర్ మిల్స్, లోయర్ ట్యాంక్బండ్, కట్టమైసమ్మ దేవాలయం, తెలుగు తల్లి ఫ్లై ఓవర్ మీదుగా, డీబీఆర్ మిల్స్ నుంచి ట్యాంక్బండ్ వైపు నుంచి అయితే.. డీబీఆర్ మిల్స్, గోశాల, కవాడిగూడ, జబ్బార్ కాంప్లెక్స్, బైబిల్ హౌస్ మీదుగా, ఇక్బాల్ మినార్ నుంచి సికింద్రాబాద్ వైపు వచ్చే వారిని పాత సచివాలయం, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా మళ్లిస్తారు.
ఆదివారం పూట ఆహ్లాదానికి చిరునామాగా మారిన ట్యాంక్బండ్పై మరింత వినోదం అందించనున్నారు. అక్టోబర్ 3న జరిగే సన్డే.. ఫన్డే కార్యక్రమంలో అన్ని వయసుల వారిని మంత్రముగ్ధులను చేసేందుకు 20 మందితో కూడిన కళాకారుల బృందం ట్యాంకుబండ్ పొడవునా పులివేషాలతో సందర్శకులను అలరించనున్నారు. గత రెండు ఆదివారాల్లో ఆర్మీ, రైల్వే పోలీసులతో బ్యాండ్ ప్రదర్శన నిర్వహించగా, ఈ సారి తెలంగాణ రాష్ట్ర పోలీస్ బ్యాండ్ తమ వాయిద్య సంగీతంతో అలరించనుంది.