హైదరాబాద్: నగరంలోని హైటెక్స్లో ఈనెల 25న టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ సమావేశానికి రాష్ట్ర నలుమూలల నుంచి అధిక సంఖ్యలో ప్రముఖులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరవుతుండటంతో హైటెక్స్ పరిసరాలలో భారీగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశాలున్నాయని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు. ఈ మేరకు ప్రజలకు పలు సూచనలు చేశారు.