మానవపాడు, మే 2 : అతివేగం యువకుడి ప్రాణం మీదకు తెచ్చిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. మద్దూరు గ్రామానికి చెందిన మాలిక్ (28) సొంత ట్రాక్టర్పై ఇసుక నింపుకొని మానవపాడు బయలుదేరాడు. అమరవాయి గ్రా మ శివారులోకి రాగానే ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది.
మాలిక్ కుడి కాలి తొడ భాగానికి చెట్టుకొమ్మ కుచ్చుకొన్నది. స్థానికులు అక్కడికి చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై చంద్రకాంత్ వచ్చాక కొమ్మని రంపం తో కట్ చేశారు. ఇంకా తొడ భాగంలో కొమ్మ ఉండటంతో కర్నూల్ దవాఖానకు తరలించారు.