న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: టయోటా కిర్లోస్కర్ వాహనాలు మరింత ప్రియంకాబోతున్నాయి. ఉత్పాదక వ్యయం పెరుగడంతో అన్ని మోడళ్ళ ధరలను 2 శాతం వరకు పెంచుతున్నట్లు మంగళవారం సంస్థ ప్రకటించింది. పెరుగనున్న ధరలు వచ్చే నెల 1 నుంచి అమలులోకి రానున్నాయి. దేశీయ మార్కెట్లో ఇన్నోవా క్రిస్టా, ఫార్చ్యూనర్ మోడళ్ళను విక్రయిస్తున్న ఈ సంస్థను జపాన్కు చెందిన టయోటా మోటర్ కంపెనీ, కిర్లోస్కర్ గ్రూపులు సంయుక్తంగా ఏర్పాటుచేశాయి. ఇప్పటికే మారుతితోపాటు టాటా మోటర్స్, ద్విచక్ర వాహన సంస్థయైన హీరో మోటోకార్ప్ ధరలను పెంచిన విషయం తెలిసిందే.