Telangana | తెలంగాణ ప్రాంత రైతులకు సాగు సవాళ్లతో కూడుకొన్న వ్యవహారం. వానకాలంలో వర్షాలు పడితేనే పంటలు సాగయ్యేవి. యాసంగిలో భూములన్నీ బీడుగానే ఉండేవి. సాగునీటి వసతి లేకపోవడంతో తెలంగాణ కరువుకు చిరునామాగా ఉండేది. తెలంగాణ ఏర్పాటు తర్వా త సీఎం కేసీఆర్ సాగునీటి గోస తీర్చడంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు సాయంతో బీడుభూములకు జలకళ తెచ్చారు. దీంతో 2014-15లో యాసంగి, వానకాలం కలిపి 1.31 కోట్ల ఎకరాలుగా ఉన్న సాగువిస్తీర్ణం, 2022-23లో 2.09 కోట్ల ఎకరాలకు పెరిగింది. అదనంగా ఏటా 15-20 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి.
తొమ్మిదేండ్లలో సాగు విస్తీర్ణంలో మార్పు ఇది
2014 – 1.31 కోట్ల ఎకరాలు
2023 – 2.09 కోట్ల ఎకరాలు
పెరుగుదల – 60శాతం
విశేషం
75 ఏండ్ల స్వతంత్ర భారతంలో దేశవ్యాప్తంగా పెరిగిన సాగు విస్తీర్ణం 6.7% కాగా, కేసీఆర్ పాలనలో తెలంగాణలో పెరిగిన సాగు విస్తీర్ణం 60%. కేసీఆర్ ప్రభుత్వంలాగ సాగుపై కేంద్రప్రభుత్వం దృష్టి సారించినైట్లెతే, వచ్చే ఇరవై ఏండ్లకు సరిపడా ధాన్యరాశులను ఒక్క ఏడాదిలోనే పండించే స్థాయికి భారత్ చేరుకునేది.