నల్లగొండ: జిల్లాలోని చిట్యాల మండలంలో విషాదం చోటుసుకుంది. మండలంలోని వెలిమినేడులో పిడుగుపాటుకు గీతకార్మికుడు (Toddy tapper) మృతిచెందాడు. గ్రామానికి చెందిన అంతటి శివకుమార్ (29) ఆదివారం సాయంత్రం కల్లు గీయడానికి వెళ్లాడు. అయితే ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో ఓ చెట్టు కింద నిలబడ్డాడు. కాగా, అదే చెట్టుపై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
అయితే రాత్రి పొద్దుపోయినప్పటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతని కోసం వెతికారు. ఈక్రమంలో సోమవారం ఉదయం శివకుమార్ మృతదేహాన్ని గుర్తించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు.