హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ) : గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు బంద్ కానున్నాయి. మాంసం దుకాణాలు కూడా మూతపడనున్నాయి. తిరిగి శనివారం ఇవన్నీ తెరుచుకోనున్నాయి.
ఈ విషయం తెలుసుకొన్న మందుబాబులు గురువారం ఉదయం నుంచే క్యూలో నిలబడి మరీ మద్యాన్ని కొనుగోలు చేశారు.