హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి ఆమోదించాలన్న డిమాండ్తో జాతీయస్థాయి ఉద్యమాన్ని నిర్మిస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య తెలిపారు. గణేశ్ నవరాత్రులు, ప్రముఖుల సూచనల మేరకు మంగళవారం నిర్వహించ తలపెట్టిన బీసీ బిల్లు సాధన సదస్సును అక్టోబర్ మొదటి వారానికి వాయిదా వేశామని వెల్లడించారు. సోమవారం ఆయన బీసీభవన్లో రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావుతో కలిసి మీడియాతో మాట్లాడుతూ..
చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్ల సాధన చిరకాల డిమాండ్ అని, పార్లమెంట్లో బీసీ బిల్లు ఆమోదించేంత వరకు పోరాటం ఆగబోదని చెప్పారు. అన్ని బీసీ సంఘాలు, కుల సంఘాలు ఏకమై ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. వకుళాభరణం కృష్ణమోహన్రావు మాట్లాడుతూ.. మహిళా బిల్లుల్లో ఓబీసీ సబ్కోటాను చేర్చి చట్టం చేయాలని డిమాండ్ చేశారు. బీసీల డిమాండ్లను సానుకూలంగా పరిషరించే దిశగా కేంద్రం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ, బీఆర్ఎస్ నేత నాగేంద్రగౌడ్ తదితరులు పాల్గొన్నారు.