ఓటరు స్లిప్పులను గుర్తింపు కార్డుగా పరిగణనలోకి తీసుకోం. ఓటరు కార్డు లేదా ఇతర 12 రకాల కార్డుల్లో ఏదైనా ఒకటి తీసుకొనిరావాలి. రాజకీయ పార్టీలు ఇచ్చే ఓటరు స్లిప్పుపై అభ్యర్థి పేరు, గుర్తు, పార్టీ పేరు ఉండకూడదు. తెల్లకాగితంపై ముద్రించిన వాటిని మాత్రమే పోలింగ్ కేంద్రంలోకి అనుమతిస్తాం.
-సీఈవో వికాస్రాజ్
ఎన్నికల పోలింగ్ సందర్భంగా గురువారం ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, అన్ని విద్యాసంస్థలకు సెలవు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాలున్న విద్యాసంస్థలకు బుధ, గురువారాల్లో సెలవు ఇచ్చారు. ఎన్నికల విధుల్లో ఉన్న విద్యాశాఖ సిబ్బందికి బుధ, గురువారాల్లో సెలవుతోపాటు డిసెంబర్ 1న స్పెషల్ క్యాజువల్ లీవుగా ప్రకటించారు.
మొత్తం పోలింగ్ కేంద్రాలు 35,655
వెబ్ క్యాస్టింగ్ కేంద్రాలు 27,094
సమస్యాత్మక కేంద్రాలు 12,000
హోం ఓటింగ్లో ఓటుహక్కు వినియోగించుకున్న వారు 27,178
అత్యవసర సేవల సిబ్బంది 1,720
80 ఏండ్లు పైబడినవారు 15,999
దివ్యాంగులు 9,459
ఓటుహక్కు వినియోగించుకున్న ఎన్నికల సిబ్బంది 1.48 లక్షలు
ఓటుహక్కును డౌన్లోడ్ చేసుకున్న సర్వీసు ఓటర్లు 10,191