హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 దరఖాస్తుకు మంగళవారంతో గడువు ముగియనున్నది. గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి మే 2 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా, సోమవారం వరకు 2,94,644 మంది దరఖాస్తు చేసుకున్నారు. చివరి రోజు కావడంతో మంగళవారం భారీగా స్పందన రావచ్చునని, మొత్తం దరఖాస్తులు మూడు లక్షలకు చేరవచ్చునని టీఎస్పీఎస్సీ భావిస్తున్నది. ఇప్పటివరకూ 1,68,658 మంది కొత్తగా ఓటీఆర్ నమోదు చేసుకున్నారు. ఓటీఆర్ ఎడిట్ చేసుకున్న వారి సంఖ్య 3,45,841కి చేరింది. ఓటీఆర్ నమోదు, ఎడిట్ చేసుకున్న వారి సంఖ్య కలిపితే మొత్తం 5,14,499. టీఎస్పీఎస్సీలో గతంలోనే 25,38,590 మంది అభ్యర్థులు ఓటీఆర్ చేసుకోగా, వీరిలో 21,92,749మంది ఇంకా ఓటీఆర్ చేసుకోవాల్సి ఉన్నది. కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం టీఎస్పీఎస్సీలో ఓటీఆర్ ఎడిట్ చేసుకుంటేనే దరఖాస్తు చేసుకోవడానికి వీలవుతుంది.