హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 128వ జయంతి కార్యక్రమాన్ని మంగళవారం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్నది. రజక ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి వేడుకలను హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించనున్నారని ఎంబీసీల జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.సీఎం కేసీఆర్ హయాంలోనే తెలంగాణ పోరాటయోధులకు సముచిత గౌరవం లభిస్తున్నదని కొనియాడారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఊరూరా ఘనంగా నిర్వహించాలని రజకసంఘాల నేతలకు విజ్ఞప్తి చేశారు.