హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయుల కొరత సమస్యను అధిగమించేందుకు పాఠశాల విద్యాశాఖ టీచర్లను తాత్కాలికంగా సర్దుబాటు చేస్తున్నది. జిల్లాల వారీగా డీఈవోలు అవసరాన్ని బట్టి నియమిస్తున్నారు. ఇటీవలే మల్టీజోన్ -1లో స్కూల్ అసిస్టెంట్ల బదిలీలు పూర్తయ్యాయి. అయితే పలు పాఠశాలల్లో అవసరానికి మించి టీచర్లుండగా, మరికొన్ని స్కూళ్లల్లో సబ్జెక్టు టీచర్ల కొరత సమస్య తలెత్తుతున్నది. పదో తరగతి పరీక్షలు, సబ్జెక్టుల బోధన దృష్ట్యా డీఈవోలు స్కూల్ అసిస్టెంట్లను డిప్యూటేషన్ పద్ధతిలో తాత్కాలిక సర్దుబాటు ప్రక్రియను చేపట్టారు.