హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): ఉద్యోగుల వేతన సవరణకు వీలుగా రిటైర్డ్ ఐఏఎస్ ఎన్ శివశంకర్, సభ్యుడిగా బీ రామయ్యతో కూడిన పీఆర్సీ కమిటీని ఏర్పా టు చేయడం పట్ల టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, మారం జగదీశ్వర్ హర్షం వ్యక్తంచేశారు. ఉద్యోగులకు నగదు రహిత వైద్య సదుపాయం (ఈహెచ్ఎస్) కల్పించాలని టీఎన్జీవో ప్రభుత్వాన్ని కోరింది. పెండింగ్ డీఏలను సైతం మంజూరుచేయాలని విజ్ఞప్తిచేసింది.
ఈ మేరకు మంగళవారం టీఎన్జీవో ప్రతినిధి బృందం ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావును హైదరాబాద్లో కలిసి వినతిపత్రం సమర్పించింది. వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటుచేయడంతోపాటు, మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించినందుకు ఉద్యోగుల పక్షాన టీన్టీవో నేతలు ధన్యవాదాలు తెలియజేశారు. అయితే 5% ఐఆర్ విషయంలో పునరాలోచించాలని కోరారు. ఐఆర్పై ఉద్యోగుల్లో ఆందోళన నెలకొన్నదని, దీనిని పెంచాలని కోరారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, సీపీఎస్ను రద్దుచేయాలని విజ్ఞప్తి చేయగా మంత్రి సానుకూలంగా స్పందించారని రాజేందర్, జగదీశ్వర్ తెలిపారు.