హైదరాబాద్ : ఎమ్మెల్సీగా ఎన్నికైన ప్రొఫెసర్ కోదండరామ్కు టీఎన్జీవో కేంద్ర సంఘం(TNGO leaders) ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏఐఎస్జీఈఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడుమారం జగదీశ్వర్, టీఎన్జీవో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, పర్వతాలు, తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జ్ఞానేశ్వర్, లక్ష్మణ్ తదితరులు గురువారం ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్లో మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు.
కాగా, తమిళిసై సౌందరరాజన్ గవర్నర్ కోటా(Governor Kota) ఎమ్మెల్సీల( MLCs)ను నియమించారు. తెలంగాణ జన సమితి వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ కోదండరాం(Kodandaram ), మీర్ అమీర్ అలీఖాన్లను ఎమ్మెల్సీలుగా నియామకమయ్యారు. వీరిద్దర్ని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమిస్తూ రాజ్ భవన్ నుంచి ఉత్తర్వులు వచ్చాయి.
తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ కోదండరామ్ కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో కోదండరాం కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. అందులో భాగంగా కోదండరామ్కు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని రేవంత్ రెడ్డి హామీనిచ్చారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోదండరామ్ను ఎమ్మెల్సీగా ఖరారు చేసింది.