హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ జన సమితి (టీజేఎస్) హైదరాబాద్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు జహీరుద్దీన్ బీఆర్ఎస్లో చేరారు. గురువారం బీఆర్ఎస్ హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి పుస్తే శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఆయన కారెక్కారు.
జహీరుద్దీన్కు హోంశాఖ మంత్రి మహమూద్ అలీ గులాబీ కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు మరో 100 మంది బీఆర్ఎస్లో చేరారు.