తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీ వేకంటేశ్వర స్వామివారి శ్రీవాణి ట్రస్టు (Srivani Trust) దర్శన టికెట్లను (Darshan Tickets) తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) విడుదల చేయనుంది. మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన ఆన్లైన్ కోటా టికెట్లు శుక్రవారం అందుబాటులో ఉంచనుంది. రోజుకు 500 టికెట్ల చొప్పున మధ్యాహ్నం 12 గంటలకు ఆన్లైన్లో టికెట్లను విడుదల చేస్తుంది. వీటితోపాటు వసతి గదులకు సంబంధించిన టోకెన్లను కూడా అందుబాటులో ఉంచనుంది. ఆఫ్లైన్ పద్ధతిలో టీటీడీ జేఈవో కార్యాలయంలో రోజుకు 400 టికెట్ల చొప్పున, 100 టికెట్లను తిరుపతి (Tirupati) విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కింద జారీ చేస్తున్న విషయం తెలిసిందే.
కాగా, తిరుమలలోని (Tirumala) గోకులం కార్యాలయంలో ఆఫ్లైన్లో శ్రీవాణి టిక్కెట్ల జారీని టీటీడీ ఇటీవల పునఃప్రారంభించింది. ఫిబ్రవరి నెలలో ఇప్పటికే 750 టికెట్లు ఆన్లైన్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. అందువల్ల ఫిబ్రవరి 28 వరకు రోజుకు 150 శ్రీవాణి టికెట్లను (Srivani Trust Tickets) తిరుమలలో జారీ చేయనున్నారు.