హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి రూ.300 శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది.
బుధవారం ఉదయం 10 గంటలకు టికెట్లను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. టీటీడీ అధికారిక వెబ్సైట్లో దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.