హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారికి తమిళనాడుకు చెందిన పలువురు భక్తులు రూ.10 కోట్ల భారీ విరాళాన్ని అం దజేశారు. సోమవారం ఒక్కరోజే ఈ భారీ విరా ళం అందడం టీటీడీ చరిత్రలో ఇదే తొలిసారి. తమిళనాడులోని తిరునల్వేలికి చెందిన గోపాల బాలకృష్ణన్ అన్నదానం సహా 7 ట్రస్టులకు రూ.7 కోట్లను విరాళంగా ఇచ్చారు. ఏ స్టార్ టెస్టింగ్ అం డ్ ఇన్స్పెక్షన్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ రూ.కోటి, బాలకృష్ణ ఫ్యూయల్ స్టేషన్ సంస్థ శ్రీవాణి ట్రస్టుకు రూ.కోటి, ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్టుకు సీహబ్ ఇన్స్పెక్షన్ సర్వీసెస్ సంస్థ రూ.కోటి విరాళంగా అందజేశాయి. టీటీడీ ఈవో ధర్మారెడ్డికి దాతలు విరాళాల చెక్కులను అందజేశారు.