హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ) : తిరుపతి కోదండరామాలయంలో డిసెంబర్లో పలు విశేష ఉత్సవాలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 1, 28 తేదీల్లో పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు సీతారాముల కల్యాణం జరుగనున్నదని ఆలయ అధికారులు తెలిపారు.
డిసెంబర్ 2, 9, 16,23, 30 తేదీల్లో శనివారం పురస్కరించుకొని ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామలక్ష్మణుల మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తామన్నారు. డిసెంబర్ 12న అమావాస్య సందర్భంగా ఉదయం 7 గంటలకు సహస్ర కలాశాభిషేకం, రాత్రి 7 గంటలకు హనుమంత వాహన సేవ జరుగనున్నదని పేర్కొన్నారు. డిసెంబర్ 26న పౌర్ణమి సందర్భంగా అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తామని వివరించారు.