హైదరాబాద్, మే 20(నమస్తే తెలంగాణ): జులై, ఆగస్టు నెలల్లో తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల (300)ను ఈ నెల 24న విడుదల చేయనున్నట్టు టీటీడీ తెలిపింది. ఆ రోజు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతామని, భక్తులు tirupatibalaju. ap.gov.in ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని పేర్కొన్నది.