కాజీపేట, మే 27 : వరంగల్ నగరంలోని కాజీపేట పట్టణం 61వ డివిజన్ ప్రశాంత్నగర్ కాలనీలోని పోలింగ్ కేంద్రంలోకి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న పది మంది అనుచరులతో వెళ్లారు. దీనిపై అక్కడే ఉన్న పట్టభద్రుల ఓటర్లు, స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనల మేరకే ఓటర్లు వెళ్లారని పోలీసులు చెప్పడంతో పోలీసులతోనూ వాగ్వాదానికి దిగారు. పాఠశాల ఆవరణలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించాలని నిరసన తెలిపారు. మల్లన్నకు ఉన్న అదనపు అర్హతలు ఏమిటని వారు నిలదీయడంతో పోలీసులు సమాధానం చెప్పలేక నీళ్లు మింగారు. అనంతరం అనుచరులను బయటికి పంపి అభ్యర్థి మల్లన్ననే అనుమతించడంతో వాగ్వాదం సద్దుమణిగింది.