తిమ్మాపూర్ రూరల్ : తెలంగాణ పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్వీ నాయకులు వినూత్న నిరసన తెలిపారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో టీఆర్ఎస్వీ జిల్లా ప్రధాన కార్యదర్శి అనవేణి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ‘గోబ్యాక్ మోదీ, బైబై మోదీ’ ఫ్లెక్సీ ప్రదర్శించారు. రాష్ర్టానికి తీవ్ర అన్యాయం చేసి, ఏ మొఖం పెట్టుకొని వస్తున్నారు? అని ప్రశ్నించారు.