ఖమ్మం : జిల్లాలోని సత్తుపల్లి ఫారెస్ట్ రేంజ్ ఏరియాలో పెద్ద పులి కలకలం సృష్టిస్తోంది. కిష్టారం, జగన్నాథపురం ఏరియాల్లో పులి పాదముద్రలను స్థానిక పశువుల కాపరులు గుర్తించారు. దీంతో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. కిష్టారం, జగన్నాథపురం ఏరియాల్లో పర్యటించిన అధికారులు, పులి పాదముద్రల గుర్తులను సేకరించారు.
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. సత్తుపల్లి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో సీసీ కెమెరాలు అమర్చామని తెలిపారు. ఈ కెమెరాల ద్వారా పెద్దపులి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తామని చెప్పారు. ప్రజలెవరూ కూడా అడవి లోపలికి వెళ్లకూడదని అధికారులు ఆదేశించారు.