భీంపూర్, ఆగస్టు 29: ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండల పరిధిలోని పెన్గంగకు అవతలి వైపున మహారాష్ట్రలోని రాంనగర్ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం పేరపుతున్నది. అక్కడి బందీ అటవీ ప్రాంతంలో రెండు రోజులుగా పెద్దపులి మూడు పిల్లలతో సంచరిస్తున్నది. తిప్పేశ్వర్ అభయారణ్యంలో అంతర్భాగంగా ఉన్న ఈ అటవీ ప్రాంతం గుండా ఆదిలాబాద్ టు యావత్మాల్ ప్రధాన రహదారి ఉన్నది. ఈ రోడ్డును పెద్దపులి దాటుతుండగా స్థానికులు ఫొటోలు తీశారు. స్థానికులు అటవీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. పులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురువుతున్నారు.