కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లి మండలంలో పులి (Tiger) కలకలం రేపుతున్నది. మండలంలోని పెద్దమ్మతల్లి గుట్ట-ఆంజనేయపాలెం అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నది. శనివారం ఉదయం జంగాలపల్లి అడవుల్లో పులి రోడ్డు దాటుతూ కనిపించిన విషయం తెలిసిందే.
ఆదివారం ఉదయం ఆంజనేయుపాలెంలో అడవుల్లో పులిని చూసినట్లు మేకల కాపరులు అటవీ సిబ్బందికి తెలిపారు. దీంతో సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచించారు. పులి సంచారంతో గ్రామాల ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పులిని సాధ్యమైనంత తొందరగా పట్టుకోవాలని కోరుతున్నారు.