ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని పిప్పల్కోటి శివారులో గల రిజర్వాయర్ కట్ట నిర్మాణ ప్రాంత సమీపంలో శనివారం అర్ధరాత్రి మళ్లీ పెద్ద పులి కనిపించింది. కట్ట నిర్మాణ పనులు చేపడుతున్న కూలీలు భయాందోళనకు గురయ్యారు. తమ సెల్ఫోన్లో ఫొటోలు కూడా తీశారు. కాగా.. ఈ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు బేస్క్యాంపు నిర్వహిస్తున్నారు. ఎనిమల్ ట్రాకర్స్, సీసీ నైట్ విజన్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. పులి సంరక్షణ చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ఎఫ్ఆర్వో గులాబ్, ఎఫ్ఎస్వో ప్రేంసింగ్ తెలిపారు.